లక్నోతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ జట్టు తడబడుతోంది. తప్పుడు అంపైరింగ్ నిర్ణయాలతో రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. నాలుగో వికెట్ కోల్పోయింది. అంతకుముందు పృథ్వా షా (5) బంతిని సరిగా అంచనా వేయలేక అవుటయ్యాడు. ఆ తర్వాత బదోనీ అందుకున్న క్యాచ్.. నేలను తాకినట్లు కనిపిస్తున్నా అంపైర్ అవుట్గా ప్రకటించడంతో వార్నర్ పెవిలియన్ చేరాడు.
కాసేపటికే బంతి బ్యాటును తాకకపోయినా కాట్ బిహైండ్గా మార్ష్ (37)ను అవుటిచ్చాడు అంపైర్. తర్వాతి ఓవర్లోనే లలిత్ యాదవ్ (3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బిష్ణోయి వేసిన గూగ్లీ అతన్ని బోల్తా కొట్టించింది. దీంతో 9 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు 4 వికెట్ల నష్టానికి 87 పరుగులతో నిలిచింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 109 పరుగులు అవసరం ఉన్నాయి.