లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ ఓపెనర్లు పూర్తిగా విఫలమయ్యారు. పృథ్వీ షా (5), డేవిడ్ వార్నర్ (3) ఇద్దరూ నిరాశపరిచారు. చమీర వేసిన బంతిని సరిగా అంచనా వేయలేక షా పెవిలియన్ చేరితే.. థర్డ్ అంపైర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయంతో వార్నర్ మైదానాన్ని వీడాడు.
ఇలాంటి సమయంలో మిచెల్ మార్ష్ (32 నాటౌట్), కెప్టెన్ పంత్ (9 బంతుల్లో 27 నాటౌట్) ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. షా, వార్నర్ ఇబ్బంది పడిన అదే పిచ్పై పవర్ప్లేలో మిగిలిన మూడు ఓవర్లలో దంచికొట్టారు. వీళ్లిద్దరూ భారీ షాట్లు ఆడటంతో పవర్ప్లే ముగిసే సరికి ఢిల్లీ జట్టు రెండు వికెట్ల నష్టానికి 66 పరుగులతో నిలిచింది.