మెల్బోర్న్: ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టు(AUSvIND)కు చెందిన తొలి రోజు టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. డిసెంబర్ 26వ తేదీన నాలుగవ టెస్టు ప్రారంభంకానున్నది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్లో.. ఇరు జట్లు చెరో విజయాన్ని నమోదు చేశాయి. తొలి టెస్టును ఇండియా గెలుచుకోగా, రెండో టెస్టును ఆసీస్ సొంతం చేసుకున్నది. శనివారం నుంచి బ్రిస్బేన్లో మూడవ టెస్టు ప్రారంభంకానున్నది. అయితే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ప్రత్యేక క్రేజీ ఉంటుంది. ఆ టెస్టుకు చెందిన డే వన్ టికెట్లు అన్నీ అమ్ముడుపోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ ప్రకటించింది. నాన్ మెంబర్స్ కోసం డిసెంబర్ 24వ తేదీన కొన్నిటికెట్లను అమ్మకానికి రిలీజ్ చేయనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
అడిలైడ్ టెస్టును లక్షా 35 వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. తొలి రోజు స్టేడియానికి సుమారు 36 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. పెర్త్ టెస్టుకు కూడా భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
All available public tickets for Day 1 of the NRMA Insurance Boxing Day Test have been sold 🤯
There will be a possible final release of a small number of public tickets on December 24 for non-members to get their seats.#AUSvIND pic.twitter.com/WuftKNTJ95
— Cricket Australia (@CricketAus) December 10, 2024