Davis Cup 2024: ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన భారత డేవిస్ కప్ జట్టు చరిత్ర సృష్టించింది. 3-0 తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసి వరల్డ్ గ్రూప్-1 టైలో చోటు దక్కించుకుంది. శనివారం జరిగిన సింగిల్స్ పోరులో రామ్కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీలు విజయం దక్కించుకోగా తాజాగా డబుల్స్లో యూకీ బాంబ్రీ – సాకేత్ మైనేని.. 6-2, 7-6 (5) తేడాతో పాక్ జోడీ ముజామిల్ ముర్తజా – అకీల్ ఖాన్ల జోడీని ఓడించింది.
ఈ సిరీస్లో భారత్ ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. రెండు సింగిల్స్ మ్యాచ్లు, ఒక డబుల్స్తో పాటు రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్లు ఆడాలి. శనివారం జరిగిన సింగిల్స్ మ్యాచ్లలో రామ్కుమార్ రామనాథన్ 6-7, 7-6, 6-0తో ఖురేషి ఇసాముల్హక్ పై నెగ్గగా మరో పోరులో శ్రీరామ్ బాలాజీ 7-5, 6-3తో అఖిల్ఖాన్పై గెలిచాడు. ఫిబ్రవరి 3న భారత్ రెండు సింగిల్స్ మ్యాచ్లలో నెగ్గింది. ఆదివారం డబుల్స్ పోరులోనూ టీమిండియాదే విజయం. దీంతో ఇప్పటికే 3-0 ఆధిక్యంలో ఉన్న భారత్.. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ -1 ప్లేఆఫ్ లో చోటు దక్కించుకుంది.
VIDEO | Davis Cup 2024: Indian tennis team celebrate at Islamabad Sports Complex after taking unassailable 3-0 lead against Pakistan. #DavisCup pic.twitter.com/goVGIEKD59
— Press Trust of India (@PTI_News) February 4, 2024