లక్నో: డేవిస్కప్ వరల్డ్ గ్రూపు-2లో భాగంగా శనివారం భారత్, మొరాకో జట్ల మధ్య పోరు మొదలుకానుంది. ఐదుగురితో కూడిన భారత జట్టును గురువారం ప్రకటించారు. ఇందులో సుమిత్ నాగల్, శశికుమార్, ప్రతాప్సింగ్, యుకీ భాంబ్రీ, రోహన్ బోపన్నను ఎంపిక చేసినట్లు భారత కెప్టెన్ రోహిత్ రాజ్పాల్ పేర్కొన్నారు.