బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం తొలి పతకం సాధించింది. వెయిట్లిఫ్టింగ్లో 55 కేజీల విభాగంలో పోటీ పడిన భారత వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహాదేవ్ సార్గర్ రజత పతకం సాధించాడు. స్నాచ్ ఈవెంట్లో 113 కేజీల ఎత్తి స్పష్టమైన లీడ్ సాధించిన సంకేత్.. క్లీన్ అండ్ జర్క్ విభాగంలో తొలి ప్రయత్నంలోనే 135 కేజీలు ఎత్తి ఆకట్టుకున్నాడు.
అయితే ఆ తర్వాతి రెండు ప్రయత్నాల్లో 139 కేజీలు ఎత్తేందుకు ట్రై చేసి విఫలమయ్యాడు. మూడో ప్రయత్నం సమయంలో అతని భుజానికి గాయమైంది కూడా. అయినా ట్రై చేసిన అతను.. అప్పుడు కూడా 139 కేజీలు ఎత్తడంలో ఫెయిలయ్యాడు.
మొత్తానికి 248 కేజీలతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. క్లీన్ అండ్ జర్క్ విభాగంలో మలేషియాకు చెందిన మహమ్మద్ అనిక్ ఏకంగా 142 కేజీలు ఎత్తి తొలిస్థానం కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది కామన్వెల్త్ పోటీల్లో భారత్ దక్కించుకున్న తొలి మెడల్ ఇదే కావడం గమనార్హం.