కామన్వెల్త్ క్రీడల్లో 21 ఏళ్ల భారత యువ రెజ్లర్ అన్షు మాలిక్ రజత పతకం తన ఖాతాలో వేసుకుంది. రెజ్లింగ్లో 57 కేజీల విభాగంలో తలపడిన ఆమె.. సిల్వర్ మెడల్ సాధించింది. మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో రెండుసార్లు గోల్డ్ మెడల్ సాధించిన ఒడునాయో ఫోలసాడే అడెకురోయేతో అన్షు ఫైనల్లో తలపడింది.
అనుభవజ్ఞురాలైన ఒడుయానోకు గట్టిపోటీ ఇచ్చిన అన్షు.. ఓటమి చవిచూసింది. దీంతో సిల్వర్ మెడల్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సెమీస్లో శ్రీలంకకు చెందిన నెత్మి పోరుతోటగేను ఓడించిన అన్షు ఫైనల్లో అడుగుపెట్టింది. అన్షు ఇలా కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరికాసేపట్లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా తన ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. మరి పూనియా ఏ మెడల్ సాధిస్తాడో చూడాలి.
🥈🇮🇳 𝐒𝐈𝐋𝐕𝐄𝐑 𝐅𝐎𝐑 𝐀𝐍𝐒𝐇𝐔! Congratulations to Anshu Malik on winning her first medal at the Commonwealth Games.
🙌🏻 What a close encounter that was!
📸 Getty • #AnshuMalik #Wrestling #B2022 #CWG2022 #TeamIndia #BharatArmy pic.twitter.com/zz7MzFWwg5
— The Bharat Army (@thebharatarmy) August 5, 2022