Rohit Sharma: భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ మరో ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్ – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రోహిత్కు సారథిగా వందో మ్యాచ్ కావడం గమనార్హం. తద్వారా భారత జట్టుకు వంద, అంతకంటే ఎక్కువ మ్యాచ్లలో సారథిగా వ్యవహరించిన ఏడో కెప్టెన్గా రికార్డులకెక్కాడు.
రోహిత్ కంటే ముందు ఈ జాబితాలో ఎంఎస్ ధోని, మహ్మద్ అజారుద్దీన్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్ల భారత్కు వంద మ్యాచ్లకు సారథ్యం వహించినవారిలో ఉన్నారు. 2021లో విరాట్ కోహ్లీ నుంచి పగ్గాలు అందుకున్న రోహిత్.. ఆటగాడిగానే గాక కెప్టెన్గా కూడా భారత జట్టుపై తనదైన ముద్ర వేస్తున్నాడు. సారథిగా రోహిత్ విన్నింగ్ పర్సంటేజ్ 70 శాతానికి పైగా ఉండటం గమనార్హం.
కెప్టెన్గా హిట్మ్యాన్..
టీ20లలో భారత్కు 51 మ్యాచ్లకు సారథ్యం వహించిన రోహిత్.. 39 మ్యాచ్లలో గెలిపించి 12 మ్యాచ్లు ఓడిపోయాడు. పొట్టి ఫార్మాట్లో రోహిత్ విజయాల శాతం 76.47శాతంగా ఉంది.
వన్డే ఫార్మాట్లో 38 మ్యాచ్లకు సారథిగా వ్యవహరించిన రోహిత్.. 28 మ్యాచ్లలో భారత్ను గెలిపించాడు. తొమ్మిది మ్యాచ్లలో ఓడగా ఒకదాంట్లో ఫలితం తేలలేదు. వన్డేలలో రోహిత్ విజయాల శాతం 73.68గా ఉంది.
9 టెస్టులలో టీమిండియాకు కెప్టెన్గా ఉన్న రోహిత్.. ఐదింటిలో గెలిచి రెండింటిలో ఓడాడు. రెండు డ్రా అయ్యాయి. రెడ్ బాల్ క్రికెట్లో రోహిత్ విజయాల శాతం 71.42గా ఉంది.