SRH vs RR : సన్రైజర్స్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో రాజస్థాన్ ర్యాల్స్ బ్యాటర్లు దంచుతున్నారు. 24 వద్ద తొలి వికెట్ పడినా .. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(33) జోరు తగ్గించలేదు. భువనేశ్వర్ వేసిన ఆరో ఓవర్లో రెచ్చిపోయాడు. తన బ్యాట్ పవర్ చూపిస్తూ సిక్సర్, ఫోర్, ఫోర్, ఫోర్ బాదాడు. దాంతో, 6 ఓవర్లకు రాజస్థాన్ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది.
హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలి బ్రేక్ ఇచ్చాడు. ఓపెనర్ టామ్ కొహ్లెర్ కాడ్మొరె(10)ను పెవిలియన్ పంపాడు. దాంతో, 24 వద్ద రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన సారథి సంజూ శాంసన్(6) దూకుడుగా ఆడుతున్నాడు.