భారీ లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. కెప్టెన్ డుప్లెసిస్ (8), కోహ్లీ (1), ఓపెనర్ అనూజ్ రావత్ (12) నిరాశపరచగా.. విజయంపై కొద్దిగా ఆశలు రేపిన గ్లెన్ మ్యాక్స్వెల్ (26)ను జడేజా క్లీన్బౌల్డ్ చేయడంతో బెంగళూరు కష్టాలు రెట్టింపయ్యాయి. అలాంటి సమయంలో ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సూయష్ ప్రభుదేశాయి (34) కాసేపు పోరాడాడు.
అతనికి షాబాజ్ అహ్మద్ నుంచి మంచి సహకారం అందింది. ఇద్దరూ కలిసి జట్టును విజయం దిశగా నడిపించేలా కనిపించారు. అయితే ఈ మ్యాచ్లో బెంగళూరు పాలిట శాపంలా మారిన మహీష్ తీక్షణ.. మరోసారి చెన్నైకు బ్రేక్ ఇచ్చాడు. భారీ షాట్లు ఆడుతున్న ప్రభుదేశాయిని క్లీన్ బౌల్డ్ చేశాడు. పదమూడో ఓవర్ తొలి బంతికే ప్రభుదేశాయి అవుటయ్యాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు 5 వికెట్ల నష్టానికి 116 పరుగులతో నిలిచింది. బెంగళూరు గెలవాలంటే ఏడు ఓవర్లలో 101 పరుగులు అవసరం ఉన్నాయి.