చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు తడబడుతోంది. ఓపెనర్లిద్దరితోపాటు విరాట్ కోహ్లీ (1) కూడా పెవిలియన్ చేరడంతో బెంగళూరు విజయావకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆరంభం నుంచి క్రీజులో ఇబ్బందిగా కనిపించిన డుప్లెసిస్ (8) భారీ షాట్కు యత్నించి అవుటవగా.. విరాట్ కోహ్లీ కూడా మరోసారి షార్ట్ పిచ్ బంతికి బలయ్యాడు.
యువ ఓపెనర్ అనూజ్ రావత్ (12) క్లియర్గా ఎల్బీడబ్ల్యూ అవుటైనా కూడా.. రివ్యూ తీసుకున్నాడు. రీప్లేలో బంతి మిడ్ వికెట్ను కూల్చేదని తేలడంతో అతను నిరాశగా వెనుతిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే భారీ షాట్లు ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్వెల్ (26)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బెంగళూరు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.