పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి చెన్నై సూపర్ కింగ్స్ చాలా కష్టపడుతోంది. ప్రధాన బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ (1), రాబిన్ ఊతప్ప (13), మొయీన్ అలీ (0), జడేజా (0), రాయుడు (13) పూర్తిగా విఫలమయ్యారు. దాంతో 36 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి చెన్నై జట్టు తీవ్రమైన కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో శివమ్ దూబే (57) జట్టును ఆదుకున్నాడు. తను ముందుండి ఛేజింగ్ను నడిపించాడు.
కానీ హాఫ్ సెచరీ పూర్తయిన కాసేపటికే లివింగ్స్టోన్ వేసిన బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించి అవుటయ్యాడు. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతిని అర్షదీప్ చక్కగా అందుకోవడంతో దూబే వెనుతిరిగాడు. ఆ తర్వాతి బంతికే డ్వేన్ బ్రావో (0) గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. దాంతో 15 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు 98 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఇంకా చెన్నై విజయానికి 30 బంతుల్లో 83 పరుగులు కావాల్సి ఉంది.