ఈ ఐపీఎల్ ఆరంభం నుంచి ఫామ్ లేమితో బాధపడుతున్న చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశపరిచాడు. రబాడ వేసిన రెండో ఓవర్ చివరి బంతిని స్లిప్స్లో ఉన్న ధవన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గతే ఐపీఎల్లో సీజన్ టాప్ స్కోరర్గా నిలిచిన రుతురాజ్.. ఈ సీజన్ ఆరంభం నుంచి తడబడుతూనే ఉన్నాడు. పవర్ ప్లే కూడా పూర్తిగా క్రీజులో నిలబడలేదంటే అతని ఫామ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆ తర్వాతి ఓవర్లోనే ఫామ్లో ఉన్న రాబిన్ ఊతప్ప (13) కూడా పెవిలియన్ చేరాడు. వరుణ్ అరోరా వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను.. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వీళ్లిద్దరూ అవుటవడంతో చెన్నై జట్టు 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.