పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. రుతురాజ్ గైక్వాడ్ (1), రాబిన్ ఊతప్ప (13) స్వల్ప స్కోర్లకే వెనుతిరగడంతో.. భారం అంతా తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది. అయితే గత మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన మొయీన్ అలీ (0).. ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. దీంతో చెన్నై జట్టు తీవ్రంగా కష్టాల్లో పడింది. ప
వర్ ప్లే చివరి ఓవర్లో అర్షదీప్ బౌలింగ్లో.. చెన్నై కెప్టెన్ రవీంద్ర జడేజా (0) కూడా డకౌట్ అయ్యాడు. పంజాబ్ జట్టులో అరంగేట్ర పేసర్ వైభవ్ అరోరా.. మూడు ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి.. కీలకమైన ఊతప్ప, మొయీన్ అలీ వికెట్లు తీశాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి చెన్నై జట్టు 25 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.