చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ముంబైకి కూడా తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (6) పెవిలియన్ చేరాడు. ముఖేష్ చౌదరి వేసిన బంతిని ఆడేందుకు కిషన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ ధోనీ సులభంగా అందుకున్నాడు. దాంతో కిషన్ మైదానం వీడాల్సి వచ్చింది. ఆరు పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. మూడో స్థానంలో అద్భుతమైన బౌలింగ్తో రాణించిన డానియల్ శామ్స్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్, శామ్స్ ఉన్నారు.