ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై జట్టుకు తీవ్రమైన కష్టాలు ఎదురయ్యాయి. ఆ జట్టు టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. కాన్వే (0), మొయీన్ అలీ (0), ఊతప్ప (1) ముగ్గురూ కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. దీంతో ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.
బుమ్రా వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన ఊతప్ప.. ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రాయుడు కూడా కేవలం డిఫెండ్ చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు మూడు వికెట్ల నష్టానికి 6 పరుగులు చేసింది.