ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. కుమార్ కార్తికేయ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదిన బ్రావో.. ఆ తర్వాతి బంతిని కవర్స్ మీదుగా బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే అతను అనుకున్నంత ఎత్తుగా బంతి వెళ్లలేదు. దీంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో అతను నిరాశగా పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ ఐదో బంతికి సిమర్జీత్ సింగ్ (2) కూడా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై జట్టు 80 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.