గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ డెవాన్ కాన్వే (5) స్వల్పస్కోరుకే పెవిలియన్ చేరినా.. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ మరో ఎండ్లో పాతుకుపోయి స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్తున్నాడు. అతనికి మొయీన్ అలీ (21) నుంచి కొంత సహకారం దక్కింది.
కానీ సాయి కిషోర్ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చిన మొయీన్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నారాయణ్ జగదీశన్ (8 నాటౌట్) అండగా.. రుతురాజ్ ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. వీళ్లిద్దరూ ఆచితూచి ఆడుతుండటంతో 12 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు రెండు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది.