చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు రాణించారు. ముఖ్యంగా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో చెన్నై బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ డెవాన్ కాన్వే (5) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరగా.. తర్వాత వచ్చిన మొయీన్ అలీ (21) కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
అయితే రుతురాజ్ గైక్వాడ్ (53) మరోసారి జట్టును ఆదుకున్నాడు. యువ ఆటగాడు నారాయణ్ జగదీశన్ (39 నాటౌట్)తో కలిసి మంచి ఇన్నింగ్స్ నిర్మించిన రుతురాజ్ను.. రషీద్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే (0), ధోనీ (7) ఇద్దరూ రాణించలేదు.
దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు 5 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో షమీ రెండు వికెట్లతో సత్తా చాటగా.. రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, సాయి కిషోర్ తలో వికెట్ తీసుకున్నారు.
Innings Break! @gujarat_titans put on a solid show with the ball to restrict #CSK to 133/5. 👌 👌
Will @ChennaiIPL manage to defend the total? 🤔 🤔
Scorecard ▶️ https://t.co/wRjV4rFs6i #TATAIPL | #CSKvGT pic.twitter.com/5EIO3XOYOH
— IndianPremierLeague (@IPL) May 15, 2022