చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక వికెట్లుక కోల్పోయింది. మొయీన్ అలీ వేసిన 10వ ఓవర్ తొలి బంతికే కెప్టెన్ రిషభ్ పంత్ (21) అవుటయ్యాడు. అలీ వేసిన బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో వికెట్ల మీదకు ఆడుకున్నాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రిపల్ పటేల్ తను ఎదుర్కొన్న రెండో బంతికే భారీ సిక్సర్ కొట్టాడు.
కానీ తర్వాతి బంతికే మరోసారి అలాంటి షాటే కొట్టబోయి కాన్వేకు దొరికిపోయాడు. దీంతో చెన్నై శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. ముఖేష్ చౌదరి వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతికే అక్షర్ పటేల్ (1) అవుటయ్యాడు. ముఖేష్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 81 పరుగులకే ఆరు వికెట్లు కోలపోయిన ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించడం కష్టంగా కనిపిస్తోంది.