చెన్నైతో జరుగుతున్న ఐపీఎల్ పోరులో ఢిల్లీ బౌలర్లు చివర్లో పుంజుకున్నారు. ఆరంభంలో కాన్వే (87), రుతురాజ్ (41) రాణించడంతో ఆ జట్టు చాలా వేగంగా పరుగులు చేసింది. రుతురాజ్ అవుటైన తర్వాత వచ్చిన దూబే (32) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడటంతో 18 ఓవర్లలోనే 187 పరుగులతో నిలిచింది. అయితే చివర్లో బౌలర్లు పుంజుకున్నారు. రాయుడు (5), మొయీన్ అలీ (9), ఊతప్ప (0)ను త్వరగా అవుట్ చేశారు.
చివర్లో ధోనీ (8 బంతుల్లో 21 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జీ 3, ఖలీల్ అహ్మద్ 2, మిచెల్ మార్ష్ ఒక వికెట్ తీసుకున్నారు.