Rishabh Pant | టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. మొన్నటి దాకా డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పంత్ను ఇటీవల బీసీసీఐ ముంబయికి తరలించింది. ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో ప్రస్తుతం పంత్కు చికిత్స జరుగుతోంది. కాగా, పంత్కు కుడి మోకాలి లిగమెంట్కి వైద్యులు సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.
‘శుక్రవారం ఉదయం సుమారు 10.30 గంటలకు డాక్టర్ పార్దివాలా, అతని బృందం పంత్ కుడి మోకాలి లిగమెంట్కి సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. సుమారు 2 నుండి 3 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
రిషబ్ పంత్ ఈ నెల 30వ తేదీన ఢిల్లీ నుంచి రోర్కీ వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పంత్ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రమాదం అనంతరం అతను డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అక్కడ వైద్యులు అతనికి పలు సర్జరీలు చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పంత్ను బీసీసీఐ ముంబయికి తరలించింది. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు.