హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తేతెలంగాణ): రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో టీమ్ఇండియా క్రికెటర్ హనుమ విహారి పాల్గొన్నాడు. గురువారం బొల్లారంలోని తన నివాసంలో మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా విహారి మాట్లాడుతూ ‘ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్లో పాల్గొని మొక్క నాటడం ఆనందంగా ఉంది. ఇది చాలా గొప్ప కార్యక్రమం’ అని అన్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్ రాహుల్ ద్రవిడ్తో పాటు హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్, షట్లర్ కృష్ణప్రియకు చాలెంజ్ విసిరిన విహారి మొక్కలు నాటాలని కోరాడు. ఈ సందర్భంగా గ్రీన్ఇండియా చాలెంజ్ ప్రతినిధి రాఘవ.. వృక్ష వేదం పుస్తకాన్ని విహారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.