ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో కొత్త ఛాంపియన్ అవతరించింది. ముంబై జట్టు ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ జట్టుపై విజయం సాధించి, ట్రోఫీని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన హిమాచల్ ప్రదేశ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఏకాంత్ సేన్ 37 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మంబై 19.3 ఓవర్లలో టార్గెట్ని ఛేదించింది. సర్ఫరాజ్ఖాన్ 31 నాటౌట్గా నిలిచాడు. అజింక్యా రహానే కెప్టెన్సీలో టోర్నీ ఆసాంతం అదరగొట్టే ప్రదర్శన చేసింది ముంబై. హిమాచల్ ప్రదేశ్ కూడా శిఖర్ ధావన్ సారథ్యంలో మెరుగ్గా ఆడింది. రెండూ జట్లు ముస్తాక్ అలీ ట్రీఫీ ఫైనల్కి చేరడం ఇదే మొదటిసారి.
తమిళనాడు అత్యధికంగా
భారత టెస్ట్ ఆటగాడు సయ్యద్ ముస్తాక్ అలీ పేరు మీద ఈ టోర్నీని మొదటిసారిగా 2006-07 మధ్య నిర్వహించింది బీసీసీఐ. మొదటి సీజన్లో దినేశ్ కార్తిక్ సారథ్యంలోని తమిళనాడు ట్రోఫీని గెలిచింది. ఇప్పటివరకూ తమిళనాడు జట్టు అత్యధికంగా మూడుసార్లు ఈ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.