ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ క్రికెట్ ఆస్ట్రేలియా టీ 20 వరల్డ్ కప్ 2022 జట్టుని ప్రకటించింది. వరల్డ్కప్లో అత్భుతంగా రాణించిన 11మంది ఆటగాళ్లను ఎంపికచేసింది. అందులో ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్ నుంచి ముగ్గురు, భారత జట్టు నుంచి ఇద్దరు, పాకిస్థాన్ తరఫున ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్ టీమ్ నుంచి ఒక్కో ఆటగాడిని క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్ట్ చేసింది.
ఎంపికైన ఆటగాళ్లు వీళ్లే
జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, సామ్ కరన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రీది, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సికిందర్ రజా, గ్లెన్ ఫిలిప్స్, అన్రిచ్ నార్జ్ ఉన్నారు. ఈ టీమ్కి కెప్టెన్గా జోస్ బట్లర్ పేరుని ప్రకటించింది.
ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ ముగిసిన తర్వాత మాజీ క్రికెటర్లు, స్టార్ ఆటగాళ్లు తమ డ్రీమ్ జట్టుని ప్రకటిస్తుంటారు. అన్ని టీమ్ల నుంచి ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ఒక జట్టుని, దానికి కెప్టెన్ని కూడా ఎంపికచేస్తారు. ఈ ఏడాది టీ 20 వరల్డ్ కప్ని ఆస్ట్రేలియా నిర్వహించింది. మెల్బోర్న్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్పై విజయం సాధించింది.దాంతో, రెండోసారి టీ 20 వరల్డ్ కప్ గెలిచిన రెండో జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది.