న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి భారత హెడ్కోచ్ అవతారమెత్తనున్నాడు. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్నకు ముందు జింబాబ్వేలో పర్యటించనున్న యువ భారత జట్టుకు లక్ష్మణ్ కోచ్గా వ్యవహరించనున్నాడు.
ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 22తో జింబాబ్వే పర్యటన ముగియనుండగా.. ఆసియా కప్ కోసం టీమ్ఇండియా 23న యూఏఈ వెళ్లాల్సి ఉంది. దీంతో చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు తగినంత విరామం లభించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.