ప్రారంభించిన మంత్రి జగదీశ్రెడ్డి
చివ్వెంల, అక్టోబర్ 9: తెలంగాణ క్రీడాహబ్గా మారుతుందని, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడంలో సూర్యాపేట ముందుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. దురాజ్పల్లి గ్రామ శివారులో ఆరు ఎకరాల స్థలంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్) ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన అకాడమీకి శనివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘జీవితానికి తొలి మెట్టులా క్రీడలు దోహదపడుతాయి. క్రికెట్పై యువతలో బాగా క్రేజ్ ఉంది. ప్రతిభ కల్గిన గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందుంటుంది. 150 మందికి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ సౌకర్యాలు కల్పిస్తున్న క్యాట్ వ్యవస్థాపక కార్యదర్శి సునీల్బాబుకు అభినందనలు’ అని అన్నారు. మరోవైపు సునీల్బాబు స్పందిస్తూ వికారాబాద్, నాగర్కర్నూల్లోనూ జోనల్ అకాడమీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లలితా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.