సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నేరేడ్మెట్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న మౌనికారెడ్డిని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సోమవారం అభినందించారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఏడవ ఆల్ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ చాంపియన్షిప్లో మౌనిక కాంస్య పతకంతో మెరిసింది. అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఫెన్సింగ్ ఈవెంట్లో పతకం సొంతం చేసుకుంది. గతంలోనూ నాలుగు సీనియర్ నేషనల్స్, రెండు అండర్-23 నేషనల్స్, నాలుగు యూనివర్సిటీ నేషనల్స్లో ప్రాతినిధ్యం వహించిన మౌనిక రాష్ట్ర స్థాయి టోర్నీలో స్వర్ణం సాధించింది. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) నర్మద, డీసీపీ షమీర్.. మౌనికను అభినందించారు.