భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్కు కరోనా సోకడంతో మొదట చండీగఢ్లోని తన ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నాడు. ముందు జాగ్రత్త చర్యగా 91 ఏళ్ల స్ర్పింటర్ మిల్కా సింగ్ను సోమవారం ఆస్పత్రికి తరలించినట్లు అతని కుమారుడు, గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన్ను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆందోళనచెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
ముందుగా మిల్కాసింగ్ సహాయకుల్లో కొందరికి కరోనా సోకడంతో అతని కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గత బుధవారం నిర్వహించిన టెస్టుల్లో మిల్కా సింగ్కు పాజిటివ్గా తేలింది.