సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్లపై గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. దాదాపు మూడేండ్ల తర్వాత ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా ఈనెల 25న జరిగే మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల తర్వాత జరుగుతున్న మ్యాచ్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాల్సిందిపోయి.
టిక్కెట్ల విక్రయం విషయంలో హెచ్సీఏ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇదిలా ఉంటే హెచ్సీఏపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో మంగళవారం ఫిర్యాదు నమోదైంది. అభిమానులను మోసం చేస్తూ టిక్కెట్లను అక్రమంగా బ్లాక్లో విక్రయిస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరుపాలని న్యాయవాది సలీం హెచ్ఆర్సీని ఆశ్రయించారు.