బర్మింగ్హామ్: పదకొండు రోజుల పాటు క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన కామన్వెల్త్ క్రీడలు ఘనంగా ముగిశాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ముగింపు వేడుకల్లో.. ఇంగ్లండ్ సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను కట్టిపడేశాయి. 72 దేశాలకు చెందిన 4,500 మంది పాల్గొన్న ఈ క్రీడల్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. పంజాబీ సంగీతం, బాంగ్రా నృత్యాల హోరులో త్రివర్ణ పతాకాన్ని చేబూని తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్, శరత్ కమల్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు.
నేపాల్ కోచ్గా ప్రభాకర్
న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ మనోజ్ ప్రభాకర్ నేపాల్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా నియమితుడయ్యాడు. ఇటీవల వరకు కెనడా కోచ్గా వ్యవహరించిన ప్రభాకర్.. జూలైలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. జాతీయ జట్టు తరఫున ప్రభాకర్ 39 టెస్టులు, 130 వన్డేలు ఆడాడు.
రేణుక కెరీర్ బెస్ట్ ర్యాంక్
దుబాయ్: కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం దక్కించుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు.. ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ సత్తాచాటింది. బర్మింగ్హామ్ క్రీడల్లో అత్యధిక వికెట్లు (11) పడగొట్టిన భారత పేసర్ రేణుకా సింగ్.. ర్యాంకింగ్స్లో పది స్థానాలు మెరుగు పర్చుకొని కెరీర్ బెస్ట్ 18వ ర్యాంక్లో నిలిచింది.