కొత్తగూడెం సింగరేణి: కోల్ఇండియా జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నీకి కొత్తగూడెం సిద్ధమైంది. బుధవారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో టోర్నీ జరుగనుంది. ఇందుకోసం సింగరేణి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు 18సార్లు కోల్ఇండియా పోటీలకు ఆతిథ్యమిచ్చిన సింగరేణి రికార్డు స్థాయిలో 19వ సారి టోర్నీని నిర్వహిస్తున్నది. ఈ టోర్నీలో ఈసీఎల్, బీసీసీఎల్, సీసీఎల్, సీఎంపీడీఐఎల్, ఎన్సీఎల్, డబ్ల్యూసీఎల్, ఎస్ఈసీఎల్, ఎంసీఎల్, ఎస్సీసీఎల్ జట్లు బరిలో ఉన్నాయి. బుధవారం పోటీలను సింగరేణి సీఎండీ శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణరావు, వెంకట్రావు తదితరులు హాజరుకానున్నారు.