ప్రిటోరియా: దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత అండర్-19 మహిళల జట్టు 3-0తో క్లీన్స్వీప్ చేసింది. మరో రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. మంగళవారం జరిగిన చివరి, అయిదో మ్యాచ్లో భారత అండర్-19 జట్టు 60 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖా షలాత్ 49, శ్వేత షెరావత్ 24 పరుగులతో తొలి వికెట్కు అర్ధసెంచరీ భాగస్వామ్యం(55)తో శుభారంభం అందించారు. తర్వాత హృషిత నీలాద్రి 20(నాటౌట్) పరుగులతో చాలెంజ్ విసరగల స్కోరును అందించింది.
షెస్ని నాయుడు 2 వికెట్లు పడగొట్టింది. ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 19 ఓవర్లలో 61 పరుగులకే ఆలౌటయింది. ప్రధాన బ్యాటర్లు నలుగురు 12 పరుగులకే పెవిలియన్ చేరగా కైలా రినెకె(14), జెమ్మా బోథ(11), అయంద హ్లుబి(12) రెండంకెల స్కోర్లు చేయడంతో దక్షిణాఫ్రికా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. తిథాస్ సాధు, సోనియా మెంధియా చెరి రెండు వికెట్లు, షబ్నమ్, హర్లీ గాలా, అర్చనా దేవి, గొంగడి త్రిష ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.