చెన్నై: ఐపీఎల్ తొలి మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ పది ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (19) రనౌటైనా.. మరో ఓపెనర్ క్రిస్ లిన్, సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడుతున్నారు. బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నారు. ముఖ్యంగా లిన్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటికే అతడు హాఫ్ సెంచరీ వైపు అడుగులు వేస్తున్నాడు. 23 బంతుల్లో 31 పరుగులు చేసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు. జేమీసన్ బౌలింగ్లో వికెట్ కీపర్ డివిలియర్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో వికెట్కు అతడు క్రిస్ లిన్తో కలిసి 70 పరుగులు జోడించాడు. ముంబై ఇండియన్స్ 12.3 ఓవర్లలో 100 పరుగుల స్కోరు దాటింది. క్రిస్ లిన్ 35 బంతుల్లో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.