Chris Gayle : ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్(ICC ODI WC 2023) షెడ్యూల్ వచ్చేసింది. దాంతో, టైటిల్ ఫేవరెట్ జట్లు ఇవేనంటూ మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయం చెప్పేస్తున్నారు. అంతేకాదు భారత జట్టులో స్టార్ ఆటగాళ్లలో కొందరికి ఇదే ఆఖరి వరల్డ్ కప్ అనేవాళ్లూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ క్రిస్ గేల్(Chris Gayle) ఆసక్తికర కామెంట్లు చేశాడు. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli)కి 2023 వరల్డ్ కప్ ఆడతాడని అన్నాడు. ‘రికార్డుల రారాజు విరాట్కు ఇదే ఆఖరి వరల్డ్ కప్ కాదని చెప్పాడు.
ఇంకొక వరల్డ్ కప్ ఆడగల సత్తా అతడికి ఉంది. ఈసారి టీమిండియానే ఫేవరెట్. సొంత గడ్డపై ఆడడం వాళ్లకు కలిసిరానుంది. అంతేకాదు వరల్డ్ కప్ టోర్నీకి బీసీసీఐ(BCCI) ఎటువంటి జట్టును ఎంపిక చేస్తుందో చూడాలని ఉంది’ అని ఈ యూనివర్సల్ బాస్ అన్నాడు. రెండు రోజుల క్రితం మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virendra Sehwag).. ఈసారి భారత జట్టు కోహ్లీ కోసం వరల్డ్ కప్ గెలవాలని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని మేటి బ్యాటర్లలో ఒకడైన కోహ్లీ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతను ఆదే జోరు కొనసాగిస్తే భారత్కు ఇక తిరుగుండదని కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత గడ్డపై జరగనుంది. అక్టోబర్ 5న జరిగే ఆరంభ మ్యాచ్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు ఢీ కొననున్నాయి. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్(Ahmedabad) వేదికగా జరగనుంది. నవంబర్ 19 ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. అయితే.. ఈసారి ఫైనల్తో పాటు సెమీ ఫైనల్స్కు కూడా రిజర్వ్ డేను కేటాయించారు. 2011లో టీమిండియా సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచింది. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో శ్రీలంకను చిత్త చేసి ట్రోఫీని ముద్దాడింది. మళ్లీ ఈసారి స్వదేశంలో సగర్వంగా ఐసీసీ ట్రోఫీని అందుకోవాలనే పట్టుదలతో ఉంది.