న్యూఢిల్లీ: సుదీర్మన్ కప్ టోర్నీకి భారత స్టార్ బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్శెట్టి దూరమైంది. ఫిన్లాండ్ వేదికగా ఈనెల 26 నుంచి అక్టోబర్ 3వరకు జరుగునున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో సాత్విక్, చిరాగ్ బరిలో దిగడం లేదని భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బీఏఐ) వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. ‘చిరాగ్ శెట్టి అనారోగ్య కారణాల వల్ల టోర్నీకి దూరమైనట్లు తెలిసింది. సుదీర్మన్ కప్తో పాటు ఆ తర్వాత జరుగనున్న థామస్ కప్లో ఈ జోడీ ఆడేది అనుమానంగా మారింది. చిరాగ్ కోలుకునే దానిపై వీరి ప్రాతినిధ్యం ఆధారపడి ఉంటుంది’ అని బీఏఐ వర్గాలు తెలిపాయి.