బెంగళూరు: బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (బీఎఫ్సీ)తో తన కాంట్రాక్టును భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ మరో రెండేండ్ల పాటు పొడిగించుకున్నాడు. దీంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో 2023 వరకు అతడు బెంగళూరును ముందు కు నడిపించనున్నాడు. 2013లో బీఎఫ్సీకి వెళ్లిన ఛెత్రీ అప్పటి నుంచి కెప్టెన్గా కొనసాగుతున్నాడు.