Cheteshwar Pujara: టీమిండియా డిపెండబుల్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా కొంతకాలంగా పేలవఫామ్ కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనలో జాతీయ జట్టులో చోటు కోల్పోయినా దేశవాళీలో మాత్రం అదరగొడుతున్నాడు. రంజీ ట్రోఫీ – 2023లో భాగంగా జార్ఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో పుజారా శతకంతో కదం తొక్కాడు. 162 బంతుల్లో సెంచరీ చేసిన పుజారా.. త్వరలో ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగబోయే ఐదు టెస్టుల సిరీస్లో తనకు చోటు కల్పించాల్సిందే అని జాతీయ సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ పంపకనే పంపాడు. సౌరాష్ట్ర – జార్ఖండ్ మధ్య రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో పుజారా.. శతకం చేయడంతో సౌరాష్ట్ర భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు టీ విరామ సమయానికి సౌరాష్ట్ర.. నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 338 పరుగులు చేసింది. అంతకుముందు జార్ఖండ్.. తొలి ఇన్నింగ్స్లో 142 పరుగులకే ఆలౌట్ అయింది.
రెండేండ్లుగా పుజారా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. 2021-22 దక్షిణాఫ్రికా పర్యటన నుంచి పుజారా.. జాతీయ జట్టులో తనదైన మార్కును చూపలేదు. ఇంగ్లండ్లో జరిగే కౌంటీ క్రికెట్తో పాటు దేశవాళీ క్రికెట్లో తనదైన ఫామ్ చూపిన పుజారా.. స్వదేశంలో మాత్రం విఫలమయ్యాడు. దీంతో సెలక్టర్లు.. శ్రీలంకతో 2022లో జరిగిన టెస్టు సిరీస్లో అతడిని పక్కనబెట్టారు. పుజారాతో పాటు రహానే కూడా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ గతేడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరిలో పుజారా విఫలమవగా రహానే ఫర్వాలేదనిపించాడు.
HUNDRED FOR CHETESHWAR PUJARA…..!!!!
Hundred from just 162 balls including 10 fours against Jharkhand in the Ranji Trophy 2024 – top comeback by Puj 👌 pic.twitter.com/zqeyJfwOmx
— Johns. (@CricCrazyJohns) January 6, 2024
దీనికి తోడు టీమ్ మేనేజ్మెంట్ కూడా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తుండటంతో రహానే, పుజారాలు దక్షిణాఫ్రికా పర్యటనలో మొండిచేయి చూపారు. కానీ దక్షిణాఫ్రికా టూర్లో ఈ ముగ్గురూ విఫలమయ్యారు. పుజారా గనక ఇదే ఫామ్ను కొనసాగిస్తే అతడు ఇంగ్లండ్తో టెస్టులకు రీఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.