న్యూఢిల్లీ: భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా చేతన్ శర్మ తిరిగి అవకాశం దక్కించుకున్నాడు. నిరుడు జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా సెమీఫైనల్లో ఓటమి పాలవడంతో.. సెలెక్షన్ ప్యానల్కు బోర్డు ఉద్వాసన పలకగా.. శనివారం ఎంపికైన కొత్త కమిటీలోనూ చేతన శర్మ చైర్మన్ పదవి దక్కించుకున్నాడు. కమిటీలో సౌత్జోన్ నుంచి శరత్, ఈస్ట్జోన్ నుంచి సుబ్రతో బెనర్జీ, వెస్ట్జోన్ నుంచి సలీల్ అంకోలా, సెంట్రల్ జోన్ నుంచి శివ్సుందర్ దాస్ ఎంపికయ్యారు. రెండు నెలల క్రితమే సెలెక్షన్ కమిటీ సభ్యుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. 600 అప్లికేషన్స్ వచ్చాయని అందులో నుంచి ఉత్తమమైన వాళ్లను వడబోసి 11 మందిని ఇంటర్వ్యూ చేసిన అనంతరం కొత్త కమిటీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.