మహాబలిపురం: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత యువ గ్రాండ్మాస్టర్ డీ గుకేష్ సంచలనం సృష్టించాడు. మంగళవారం ఆసక్తికరంగా సాగిన గేమ్లో స్పెయిన్ ఆటగాడు, ప్రపంచ చాంపియన్షిప్ చాలెంజర్ అలెక్సి షిరోవ్పై గుకేష్ 44 ఎత్తులలో అనూహ్య విజయం సాధించాడు. అంతేగాక తమ జట్టు భారత్ ‘బి’ 2.5-1.5తో స్పెయిన్పై విజయంలో ప్రధాన పాత్ర వహించాడు. గుకేష్ ప్రతిభతో భారత్ ‘బి’ వరుసగా అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, పెంట్యాల హరికృష్ణ తర్వాత అత్యధిక ఎలో రేటింగ్ ఆటగాడిగా గుకేశ్ నిలిచాడు. మిగతా గేముల్లో సరీన్ నిహాల్, అంటోన్ గుజారోతో డ్రా చేసుకోగా, అధీబన్.. బొనెల్లీ ఎడ్యురాడోపై గెలిచాడు. భారత్ 2.5-1.5తో రొమేనియాపై గెలిచింది.
తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ 1-0తో ఎమిలియాన్పై నెగ్గగా, మిగతా గేములను హరికృష్ణ, విదిత్, నారాయణ్ డ్రా చేసుకున్నారు. భారత ‘సీ’ టీమ్ 2.5-1.5తో చిలీని చిత్తు చేసింది. మహిళల విభాగంలో భారత్ 2.5-1.5తో ఫ్రాన్స్పై గెలిచింది. తానియా సచ్దేవ్ గెలువగా, హంపి, హారిక, వైశాలి డ్రా చేసుకున్నారు. మిగతా విభాగాల్లో భారత్ ‘సీ’ 2-2తో బ్రెజిల్పై గెలువగా, భారత్ ‘బీ’ 1-3తో జార్జియా చేతిలో ఓటమిపాలై నిరాశపరిచింది. సౌమ్య సామినాథన్, దివ్య దేశ్ముఖ్ ప్రత్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు.