చెన్నై: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లోకి అడుగుపెట్టబోతున్నదా? అంటే అవుననే అంటున్నారు ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్. సీఎస్కేను క్రికెట్తో పాటు ఇతర క్రీడల్లోనూ విస్తరించాలనుకుంటున్న యాజమాన్యం..
ముందుగా డబ్ల్యూపీఎల్లో అడుగిడాలని భావిస్తున్నది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో విశ్వనాథన్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికిప్పుడైతే కాదు గానీ రాబోయే రోజుల్లో సీఎస్కేను విస్తరిస్తాం. ముందుగా మేం మహిళల క్రికెట్లో రానున్నాం. ఆ తర్వాత అన్ని క్రీడల్లోకి అడుగిడుతాం’ అని చెప్పాడు.