ముంబై: పంజాబ్ కింగ్స్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించే దిశగా చెన్నై సూపర్ కింగ్స్ అడుగులు వేస్తోంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) త్వరగానే అవుటైనా.. మరో ఓపెనర్ డుప్లెస్సి, మొయిన్ అలీ పంజాబ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. దీంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. అలీ 29, డుప్లెస్సి 24 పరుగులతో ఆడుతున్నారు.