చెన్నై: కరోనా బారినపడిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కోలుకుంటున్నాడు. తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో అతనికి నెగెటివ్గా తేలిందని ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ హోటల్లోనే హస్సీ క్వారంటైన్లో ఉంటాడు. మరోసారి నిర్వహించిన పరీక్షలో నెగెటివ్ వస్తే హస్సీ మాల్దీవుల్లో ఉన్న ఆస్ట్రేలియా బృందంతో అతడు చేరనున్నాడని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. చెన్నై ఫ్రాంఛైజీలో హస్సీతో పాటు లక్ష్మీపతి బాలాజీలకు కరోనా సోకడంతో వీరిద్దరినీ ఎయిర్ అంబులెన్స్లో యాజమాన్యం చెన్నైకి తరలించిన సంగతి తెలిసిందే.