న్యూఢిల్లీ: టోక్యోకు వెళ్లనున్న భారత ఒలింపిక్ బృందం కోసం ‘చీర్ ఫర్ ఇండియా’ అంటూ సాగే అధికారిక గీతాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విడుదల చేశారు. అథ్లెట్లను ప్రోత్సహించేలా ఉన్న ఈ పాటను ‘చీర్4ఇండియా: హిందుస్థానీ వే’ పేరిట బుధవారం ఆవిష్కరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, గాయని అనన్య బిర్లా ఈ పాటను రూపొందించారు. దేశ ప్రజలంతా ఈ పాటను తప్పకుండా విని, భారత అథ్లెట్లను ప్రోత్సహించాలని మంత్రి ఠాకూర్ కోరారు.