దుబాయ్: పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్, వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం శివనారాయన్ చందర్పాల్, ఇంగ్లండ్ మహిళా మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. ఈ మేరకు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేస్తూ సిడ్నీలో వారిని సత్కరించనున్నట్టు తెలిపింది. దివంగత ఖాదిర్.. పాకిస్థాన్ తరఫున 67 టెస్టులు (236 వికెట్లు), 104 వన్డే (132 వికెట్లు)లలో ప్రాతినిధ్యం వహించాడు.
164 టెస్టులు, 268 వన్డేలు ఆడిన చందర్పాల్ టెస్టులలో అత్యధిక పరుగులు (11,867) సాధించిన వారిలో 8వ స్థానంలో నిలిచాడు. అంతేగాక 8 వరుస ఇన్నింగ్స్లలో అర్ధసెంచరీలు సాధించిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. చార్లెట్ ఎడ్వర్డ్స్ 2009లో ఇంగ్లండ్కు వన్డే, టీ20 ప్రపంచకప్లను అందించింది. రిటైరయ్యే నాటికి ఆమె వన్డేలు, టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్గా వినతికెక్కింది.