Khammam | జడ్చర్ల టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్-14 బాలుర క్రికెట్ టోర్నీలో ఖమ్మం జట్టు చాంపియన్గా నిలిచింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో గురువారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఖమ్మం 36 పరుగులతో రంగారెడ్డిపై గెలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫన్స్లో మహబూబ్నగర్పై ఖమ్మం.. హైదరాబాద్పై రంగారెడ్డి నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించారు. విజేతలకు జడ్చర్ల తాశీల్దార్ సత్యానారాయణ రెడ్డి, ఎంఈవో మంజులాదేవి బహుమతులు ప్రదానం చేశారు.