హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం మైదానం ద్వారానే సాధ్యమవుతుందని సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ స్టేడియంలో జరిగిన రన్కు సాట్స్ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జీవితాన్ని ఆనందంగా, అద్భుతంగా మలిచేవి ఆటలే. సీఎం కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో చలో మైదాన్ చేపడుతాం. గుడి, బడి లాగే క్రీడా మైదానాన్ని గౌరవిద్దాం. ఆరోగ్య తెలంగాణ కోసం క్రీడా మైదానాలను నిర్మిస్తున్నాం. క్రీడల ద్వారా ఆరోగ్యమే కాదు మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. బడిబాట లాగే స్వచ్చందంగా చలో మైదాన్లో భాగమవుదాం’ అని అన్నారు.