Team India Vs Zimbabwe | జింబాబ్వేతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీం ఇండియా శుభారంభం చేసింది. 190 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీం ఇండియా ఓపెనర్లే అలవోకగా టార్గెట్ పూర్తి చేశారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 30.5 ఓవర్లలోనే 192 పరుగులతో జట్టును గెలిపించారు. గాయాలతో ఆరు నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్న దీపక్ చాహర్ తొలుత మూడు వికెట్లు తీసి జింబాబ్వే వెన్ను విరిస్తే, తదుపరి బ్యాటింగ్కు వచ్చిన ఓపెనర్లు శిఖార్ ధావన్ 81, శుభ్మన్ గిల్ 82 పరుగులు చేశారు. దీంతో టీం ఇండియాపై జింబాబ్వే వరుసగా 13వ వన్డేలో ఓటమి పాలైంది.
తొలుత బౌలింగ్ చేసిన దీపక్ చాహర్ స్వింగ్తో, ప్రసీద్ కృష్ణ బౌన్సర్, అక్సర్ పటేల్ యాక్యురెసీ బౌలింగ్తో మూడేసి వికెట్లు సొంతం చేసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 40.3 ఓవర్లకే 189 పరుగులు చేసి ఆలౌట్ అయింది.. ప్రారంభంలో మైదానంలో తేమను టీం ఇండియా పేస్ బౌలర్లు తమకు అనుకూలంగా మార్చుకోవడంతో జింబాబ్వే టాప్ ఆర్డర్ ఇబ్బందుల్లో చిక్కుకుంది.
చాహార్ సహా ఇతర బౌలర్లు కేవలం 31 పరుగులకే 4 వికెట్లు తీశారు. అటుపై 110/8 స్కోర్ తర్వాత తొమ్మిదో వికెట్ కోల్పోకుండా బ్రాడ్ ఎవాన్స్, రిచర్డ్ నగరవా నిలకడగా ఆడారు. తొమ్మిదో వికెట్ భాగస్వామ్యానికి 65 బంతుల్లో 65 పరుగులు చేయడంతో జింబాబ్వే గౌరవప్రదమైన స్కోర్ చేరుకోగలిగింది. తర్వాత ప్రసీద్ కృష్ణ బౌలింగ్లో రిచర్డ్ నగరవా క్లీన్బౌల్డ్ అయ్యాడు.