హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ యూత్ చాంపియన్షిప్లో తెలంగాణ అథ్లెట్లు సత్తా చాటారు. కర్ణాటక వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మనవాళ్లు నాలుగు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం కైవసం చేసుకున్నారు. బాలికల 2000 మీటర్ల స్టీపుల్చేజ్లో పాలకుర్తి గురుకుల పాఠశాలకు చెందిన సీహెచ్ కీర్తన (7 నిమిషాల 22.55 సెకన్లు) పసిడి పతకం చేజిక్కించుకుంది.
1000 మీటర్ల స్ప్రింట్ మెడ్లే విభాగంలో తెలంగాణ బాలికల జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. శైలజ, శృతి, సాయి సంగీత, సింధుతో కూడిన తెలంగాణ జట్టు.. 2 నిమిషాల 18.95 సెకన్లలో గమ్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. బాలుర 2000 మీటర్ల స్టీపుల్చేజ్లో చంద్రశేఖర్ (6 ని. 2.35 సె.) కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నాడు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అథ్లెట్లను కోచ్లు, ఉపాధ్యాయులు అభినందించారు.