కొలంబో: కెప్టెన్ యష్ ధుల్ (108 నాటౌట్; 20 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో.. ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ కప్లో భారత్-‘ఎ’ బోణీ కొట్టింది. గ్రూప్-‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో యువ భారత జట్టు 8 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తుచేసింది. అండర్-23 ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో.. మొదట యూఏఈ 50 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది.
అశ్వంత్ (46) టాప్ స్కోరర్ కాగా.. మన బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం యష్ధుల్ సెంచరీకి నికిన్ జోస్ (41 నాటౌట్) సహకారం లభించడంతో భారత్-‘ఎ’ 26.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.